పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2023-24ను నేడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరద్, పంకజ్ చౌదరి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు.
అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు. నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24 ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి బడ్జెట్ ఇదే కానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై ఎటువంటి కసరత్తు చేసారు, ప్రజలకు ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారనే దానిపై దేశవ్యాప్తంగా పలు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలాసీతారామన్ వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా సాంప్రదాయ బహీఖాతా రూపంలో కాకుండా స్వదేశీ టాబ్లెట్ ద్వారా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటుకు తీసుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE