కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం కలబురగి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘విజయ్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనేందుకు ఆయన వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జవార్గి ప్రాంతంలో ల్యాండింగ్ కావాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ను దించే సమయంలో.. అనూహ్యంగా హెలిప్యాడ్ వద్ద ఉన్న ప్లాస్టిక్ చెత్త, వ్యర్ధాలు పెద్ద ఎత్తున గాలిలోకి లేచాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో గందరగోళం ఏర్పడింది. దీంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలెట్ చివరి నిమిషంలో హెలికాప్టర్ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. అనంతరం సెక్యూరిటీ దళాలు హెలిప్యాడ్ గ్రౌండ్ను క్లియర్ చేసిన తర్వాత తిరిగి వచ్చి చాపర్ను కిందకు దించారు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE