చిన్నారుల దగ్గు సిరప్ల ఘటనలో హర్యానా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటన నేపథ్యంలో హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ స్పందించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. మందుల నాణ్యతపై స్పష్టత ఇవ్వాలని, అలాగే డబ్ల్యూహెచ్ఓ ప్రకటన మేరకు అది తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్లలో.. ‘డైథైలిన్ గ్లైకాల్ మరియు ఇథిలీన్ గ్లైకాల్’ వాడకంపై అక్టోబర్ 14వ తేదీ లోపు తగిన వివరణ ఇవ్వాలని కోరింది. మెయిడెన్ తయారు చేసిన ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్ మరియు మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్లలో ఈ రెండు రసాయనాలు కనుగొనబడ్డాయని, ఇవి మానవ శరీరాలకు ప్రాణాంతకమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
కాగా ఇటీవల గాంబియాలో ఈ మందుల వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా 66 మంది పిల్లలు మృత్యువాత పడటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.. ఈ మందులపై ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ గతవారంలో అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సంస్థ చిన్నారుల మరణానికి దారితీసిన లోపభూయిష్ట దగ్గు సిరప్లను కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. అయితే ఈ కంపెనీ మన దేశంలో ఈ దగ్గు మందులను విక్రయించడం లేదు. అలాగే భారత ప్రభుత్వం నిర్వహించే లేబొరేటరీ మరియు లీగల్ నోడ్ డేటాబేస్ సహా కేరళ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కంపెనీకి పదే పదే హెచ్చరికలు జారీ చేశాయి. గతంలో ఒకసారి కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2005లో కేసు నమోదు చేసి, ఆ తర్వాత 2017లో కంపెనీకి జరిమానా కూడా విధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY