దేశంలో ఏప్రిల్ 22, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ఏప్రిల్ 27, సోమవారం ఉదయం 10 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ లో రాష్ట్రాలు ఇచ్చిన మినహాయింపులు, ఆర్ధిక పరిస్థితులు, కంటైన్మెంట్ జోన్ల వివరాలపై కూడా సమీక్ష జరపనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu