తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాల పరిష్కారంపై ఇరు రాష్ట్రాలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా పెండింగ్లో ఉన్న విభజన/ ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గురువారం నాడు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ లేఖలు రాశారు. జనవరి 2 తేదీన, ఢిల్లీలో నార్త్ బ్లాక్, హోంశాఖ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 119లో ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలో సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ