ఎయిర్ ఇండియా విమానాలు మరియు విస్తారా విమానాల యొక్క కార్యకలాపాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. అక్టోబర్ 17 నుండి ఈ నెల చివరి వరకు ఎయిర్ ఇండియా మరియు విస్తారా విమానాల రాకపోకలపై దేశంలో నిషేధం కొనసాగుతుందని హాంకాంగ్ తెలిపింది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హాంకాంగ్ వెల్లడించింది. అయితే ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించడం ఇది మూడోసారి. గతంలో కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆగస్టులో ఓసారి, సెప్టెంబరులో ఓసారి విమానాల రాకపోకలపై హాంకాంగ్ నిషేధం విధించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu