ఆదివారం నాడు లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్-2020 ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు మరోసారి సత్తా చాటడంతో 1968 తర్వాత ఇటలీ మళ్ళీ యూరో కప్ ను దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగింది. 2వ నిమిషంలో ఇంగ్లాండ్ ల్యూక్ షా గోల్ సాధించడంతో ఇంగ్లాండ్ ముందంజ వేసింది. అనంతరం ఇక 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్ చేయడంతో ఇరుజట్ల స్కోరు సమం అయింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో గేమ్ అదనపు సమయానికి చేరింది.
అయితే అదనపు సమయంలో కూడా ఏ జట్టు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఇక పెనాల్టీ షూటౌట్ లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచి యూరో కప్ విజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ లో ఇటలీ గోల్కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీకి గొప్ప విజయాన్ని అందించాడు. ఇటలీ గెలుపుతో ఆ జట్టు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. మరోవైపు 55 ఏళ్ల తర్వాత యూరో కప్ ఫైనల్ కు చేరిన ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవడంతో ఇంగ్లాండ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ