భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మూడు టీ20లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించింది. అయితే జట్టులో మార్పులపై బీసీసీఐ సోమవారం నాడు మరో ప్రకటన విడుదల చేసింది. వెస్టిండీస్తో శుక్రవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎడమ కాలు కండరాల స్ట్రెయిన్కు గురయ్యాడని, దీంతో ఫిబ్రవరి 16 నుంచి కోల్కతాలో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు దూరమయ్యాడని తెలిపారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసిందని పేర్కొన్నారు. అలాగే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా గాయాలతో టీ20 సిరీస్ కు దూరమయ్యారు. కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఈ టీ20 సిరీస్ కు భారత్ యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ