దేశంలో మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,75,880 కు, మరణాల సంఖ్య 1,09,856 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న వ్యూహాలు, పకడ్బందీగా చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రతి పది లక్షల జనాభాలో అతి తక్కువ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేయగలిగిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అంతర్జాతీయంగా ప్రతి పదిలక్షల మందిలో 4,794 కేసులు నమోదు కాగా, భారత్ లో ఆ సంఖ్య 5,199 గా ఉంది. ఇక బ్రెజిల్ లో పది లక్షల జనాభాకు 23911 కేసులు నమోదు కాగా, అమెరికాలో 23072, సౌత్ ఆఫ్రికాలో 11675, ఫ్రాన్స్ లో 10838, రష్యాలో 8992, బ్రిటన్ లో 8893 నమోదయ్యాయి.
అలాగే ప్రతి పది లక్షల జనాభాకి కరోనా మరణాలు కూడా భారత్ లోనే తక్కువుగా నమోదయ్యాయి. దేశంలో పది లక్షలమందిలో కరోనా మరణాలు 79 గా నమోదుకాగా, ప్రపంచ సగటు 138 గా ఉంది. ఇక ఇక బ్రెజిల్ లో పది లక్షల జనాభాకు 706 కరోనా మరణాలు నమోదు కాగా, అమెరికాలో 642, బ్రిటన్ లో 631, ఫ్రాన్స్ లో 498, సౌత్ ఆఫ్రికాలో 300, రష్యాలో 156 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu