మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14, శనివారం నాడు 5787 కరోనా కేసులు, 134 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,87,863 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,34,909 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 5,352 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 61,86,223 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.84 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.11 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 63,262 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 14738 యాక్టీవ్ కేసులు ఉండగా, సతారాలో 7295, సంగ్లీలో 6591, థానేలో 6576, అహ్మెద్ నగర్ లో 5423, సోలాపూర్ లో 5011, కొల్హాపూర్ లో 3936, ముంబయిలో 3137 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 5,07,59,767 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ