తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ 28 శాతంను చెల్లించనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గానూ 278.28 కోట్ల రూపాయలను సంస్థలోని ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సగటున ఒక్కో కార్మికునికి 60 వేల 500 రుపాయలు లాభాల బోనస్ లభించే అవకాశం ఉందని అన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మినహాయించిన జీతాన్ని కూడా 23వ తేదీన ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. అలానే ప్రతి ఏడాది ఇచ్చే దసరా పండుగ అడ్వాన్స్ డబ్బులను కూడా అక్టోబర్ 19న ఉద్యోగుల ఖాతాల్లోకి చెల్లిస్తామని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu