దేశంలో కొత్తగా 46790 కరోనా కేసులు, 587 మరణాలు నమోదు

Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, coronavirus india, India Coronavirus, India Covid-19 Updates, New Confirmed Corona Cases, total corona cases in india today, total corona positive in india

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 46,790 పాజిటివ్ కేసులు నమోదవగా, 587 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 20, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 75,97,063 కు, మరణాల సంఖ్య 1,15,197 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 69,720 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 67,33,328 కు చేరుకుంది.

మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో ప్రస్తుతం రికవరీ రేటు 88.63 శాతం గానూ, మరణాల రేటు 1.52 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్స్ లో ప్రస్తుతం 7,48,538 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =