భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కరోనాతో 1059 మంది మృతి చెందగా, మరో 67151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1000 కి పైగా మరణాలు నమోదవడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. దేశంలో మరణాల రేటు 1.8 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆగస్టు 26, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 32,34,474 కు, మరణాల సంఖ్య 59449 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 63,173 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 24,67,758 కు చేరుకుంది. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి, కోలుకుంటున్న వారి శాతం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 76.3 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 7,07,267 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu