భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు అధికార లాంఛనాలతో, సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా ఈ రోజు ఉదయం ఢిల్లీలో 10 రాజాజీ మార్గ్లో గల ప్రణబ్ నివాసంలో, ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, గులాం నబి ఆజాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అలాగే సీడిఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు ప్రణబ్ ముఖర్జీ కి నివాళులు అర్పించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu