దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం అదుపులోనే కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 243 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,78,158 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో మరణం (మహారాష్ట్రలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,699కి పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 59, కర్ణాటకలో 56, మహారాష్ట్రలో 27, తమిళనాడులో 13 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2022, డిసెంబర్ 30, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 91,05,78,181
- డిసెంబర్ 29న నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,13,080
- కొత్తగా నమోదైన కేసులు [డిసెంబర్ 29–డిసెంబర్ 30 (8AM-8AM)] : 243
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,78,158
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 185
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,43,850
- కరోనా రికవరీ రేటు : 98.80 శాతం
- యాక్టీవ్ కేసులు : 3,609 (0.01 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,699
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE