దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826 కు చేరుకుంది. గత 47 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల కంటే తక్కువుగానే నమోదవుతున్నాయి. ఇక కరోనాతో మరో 585 మంది మరణించడంతో, దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,30,254 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు ఎక్కువుగా నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 3,85,227 (1.20%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 42,295 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,13,02,345 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.46 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 13, ఉదయం 8 గంటల వరకు):
దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 48,94,70,779
మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,21,17,826
కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 12–ఆగస్టు 13 (8AM-8AM)] : 40,120
నమోదైన మరణాలు : 585
రికవరీ అయిన వారి సంఖ్య : 3,13,02,345
యాక్టీవ్ కేసులు : 3,85,227
మొత్తం మరణాల సంఖ్య : 4,30,254
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ