దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ కూడా 4 లక్షలకుపైగా కరోనా కేసులు, వరుసగా పదో రోజూ 3 వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,14,188 కేసులు, 3915 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,34,083 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, బీహార్ వంటి 10 రాష్ట్రాల్లోనే 71.81 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 36,45,164 (16.96%) కు చేరుకుంది. మరో 3,31,507 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,76,12,351 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 81.95 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (మే 6 8am–మే 7 8am) :
- మహారాష్ట్ర – 62194
- కర్ణాటక – 49058
- కేరళ – 42464
- ఉత్తరప్రదేశ్ – 26622
- తమిళనాడు – 24898
- ఆంధ్రప్రదేశ్ – 21954
- ఢిల్లీ – 19133
- వెస్ట్ బెంగాల్ – 18431
- రాజస్థాన్ – 17532
- బీహార్ – 15126
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 853
- ఉత్తర్ ప్రదేశ్ – 350
- ఢిల్లీ – 335
- కర్ణాటక – 328
- ఛత్తీస్ ఘడ్ – 212
- తమిళనాడు – 195
- హర్యానా – 177
- రాజస్థాన్ – 161
- పంజాబ్ – 154
- జార్ఖండ్ – 151
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ