దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు, 374 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,72,626 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,79,133 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 7,051 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,42,15,977 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.40 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.38 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 77,516 (0.22) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (డిసెంబర్ 23 (8am)– డిసెంబర్ 24 (8am)):
- కేరళ – 2,514
- మహారాష్ట్ర – 1,179
- తమిళనాడు – 607
- వెస్ట్ బెంగాల్ – 516
- కర్ణాటక – 299
- తెలంగాణ – 177
- ఒడిశా – 155
- ఆంధ్రప్రదేశ్ – 135
- జమ్మూ అండ్ కశ్మీర్ – 132
- ఢిల్లీ – 118
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ