దేశంలో 91 లక్షలు దాటిన కరోనా కేసులు, లక్ష 33 వేలకుపైగా మరణాలు

India Covid-19 Updates : Total Positive Cases Cross 91 Lakh Mark

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. గత కొన్ని రోజుల పాటుగా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు, మరణాలు నమోదవగా, ఇటీవల పండుగ సీజన్ అనంతరం దేశంలో పలు ప్రాంతాల్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 44,059 కేసులు నమోదు కావడంతో నవంబర్ 23, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 91,39,865 కు చేరుకుంది. కరోనాతో మరో 511 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,33,738 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 85 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ఒకేరోజులో 41,024 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 85,62,641 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతం గానూ, మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,43,486 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =