గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 150 డివిజన్లకు గానూ 1121 మంది అభ్యర్థులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీలో నిలిచినట్టు పేర్కొన్నారు. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు అన్ని డివిజన్లలో అభ్యర్థులను పోటీకి దింపాయి. టీడీపీ నుంచి 105, ఎంఐఎం నుంచి 50 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి మరియు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నవారు కలిపి మొత్తం 500 మందికి పైగా పోటీలో ఉన్నారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని జంగంమెట్లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే 2009, 2016 లలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోల్చితే ఈసారి తుది బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కొద్దిగా తగ్గినట్టుగా సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ