దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 15.68 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారికి వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా, మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 15.68 కోట్లు (15,68,16,031) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 106వ రోజైన మే 1, శనివారం నాడు 18 లక్షలకుపైగా (18,26,219) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ