దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,604 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 30, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,52,266 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.02 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 8 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,29,016 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 18,317 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.77 శాతం:
దేశంలో ప్రస్తుతం 18,317 (0.04%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,081 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,04,933 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.77 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక అక్టోబర్ 29, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 90.08 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 29న 1,57,218 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE