దేశంలో రోజువారీ కరోనా కేసులు నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,451 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,02,194 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 40 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,24,064 కి పెరిగింది. ముఖ్యంగా గత 24 గంటల్లో ఢిల్లీ (1407), హర్యానా (473), కేరళ (461), ఉత్తర్ ప్రదేశ్ (264), మహారాష్ట్ర (253), కర్ణాటక (171) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి.
ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.74 శాతంగానూ, మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి 20,635 (0.05%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 3,079 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,25,57,495 కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మే 8, ఆదివారం ఉదయం 7 గంటల వరకు 190.20 కోట్ల (1,90,20,07,487) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. గత 24 గంటల్లో 17,39,403 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ