ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర తుఫాన్ ముప్పు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి రేపు కానీ, ఎల్లుండి కానీ ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ అంచనా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,140 కి.మీ., పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 1,180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర ప్రభావంతో ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు.
మరోవైపు ఇప్పటికే కోస్తా ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీషనర్ (SRC) PK జెనా మాట్లాడుతూ.. మేము NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) యొక్క 17 బృందాలను, ODRAF (ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్) యొక్క 20 బృందాలను మరియు 175 అగ్నిమాపక శాఖ సిబ్బందిని కోరాము అని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం (మే 10) మరియు శుక్రవారం (మే 13) మధ్య గంగా పశ్చిమ బెంగాల్ జిల్లాల్లో ఉరుములు మరియు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఈ వాయుగుండం తుఫాన్గా మారిన తర్వాత దీనికి ‘అసాని’ అని నామకరణం చేయనున్నారు. సింహళ భాషలో అసాని అంటే ‘కోపం’ అని, ఈ పేరును శ్రీలంక సూచించిందని ఐఎండీ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ