దేశంలో 1994 కొత్త కరోనా కేసులు నమోదు, 219.55 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

India New Corona Positive Cases Updates on October 23rd, India Records 1994 New Covid Cases, 4 Covid Deaths October 23rd, Mango News, Mango News Telugu, India Logs 1994 Covid Positive Cases, 1994 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,994 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,42,742 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో ముఖ్యంగా మహారాష్ట్ర (387), కేరళ (346), కర్ణాటక (279), తమిళనాడు (214), వెస్ట్ బెంగాల్ (99), ఢిల్లీ (94), తెలంగాణ (78) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 4 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,961 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 23 వేలుకుపైగా (23,432 (0.05%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..

కొత్తగా 2,601 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,40,90,349 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగానూ, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద అక్టోబర్ 23, ఆదివారం ఉదయం 7 గంటల వరకు 219.55 కోట్లకుపైగా (2,19,55,98,943) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 2,10,617 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 4 =