దేశంలో కరోనా వ్యాప్తి : కొత్తగా 5,379 మందికి పాజిటివ్, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?

India Records 5379 New Covid-19 Positive Cases, 27 Deaths in Last 24 Hours

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 5,379 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,72,241 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (1154), మహారాష్ట్ర (869), కర్ణాటక (592), తమిళనాడు (449), ఒడిశా (231), గుజరాత్ (214), వెస్ట్ బెంగాల్ (211), ఢిల్లీ (200), ఉత్తరప్రదేశ్ (165), హర్యానా (159), తెలంగాణ (141) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 27 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,057 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 50 వేలుకుపైగా (50,594 (0.11%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..

కొత్తగా 7,094 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,38,93,590 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.70 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్ 7, బుధవారం ఉదయం 7 గంటల వరకు 213.91 కోట్లకుపైగా (2,13,91,49,934) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 18,81,319 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eight =