దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 56 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 30,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 403 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,34,367 కి పెరిగింది. ప్రస్తుతం 3,53,398 (1.09%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో కేరళ (17,106), మహారాష్ట్ర (4,575), తమిళనాడు (1,652), కర్ణాటక (1,350), ఆంధ్రప్రదేశ్ (1,217), ఒడిశా (911), వెస్ట్ బెంగాల్ (678), మిజోరాం (645), అస్సాం (640), మణిపూర్ (442) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 38,487 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,16,36,469 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.57 శాతం గానూ, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ