దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 92 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,376 కరోనా కేసులు, 481 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 92,22,216 కు, మరణాల సంఖ్య 1,34,699 కు చేరుకుంది. కాగా దేశంలో ప్రస్తుతం 4,44,746 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 37,816 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 86,42,771 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 93.72 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. ఇక నవంబర్ 25 నాటికీ దాదాపుగా 13.5 కోట్లకుపైగా (13,48,41,307) కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 11,59,032 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ