దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,067 కరోనా కేసులు, 94 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371 కు, మరణాల సంఖ్య 1,55,252 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 1,41,511 (1.30%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం మొత్తం 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 కంటే తక్కువగానే యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే గత 24 గంటల్లో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
మరోవైపు కొత్తగా 13,087 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,05,61,608 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.27 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ఫిబ్రవరి 9 నాటికీ దేశవ్యాప్తంగా 20,33,24,655 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,36,903 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో అత్యధికంగా కేరళలో 5214, మహారాష్ట్రలో 2551, తమిళనాడులో 469, బీహార్ లో 422, కర్ణాటకలో 366, గుజరాత్ లో 234 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ