దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,375 కరోనా కేసులు, 201 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,56,844 కు, మరణాల సంఖ్య 1,49,850 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 2,31,036 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 29,091 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 99,75,958 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.32 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.
ఇక జనవరి 4 నాటికీ దేశంలో 17,65,31,997 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 08,96,236 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో మహారాష్ట్రలో 4875, కేరళలో 3021, ఛత్తీస్ గడ్ లో 1147, తమిళనాడులో 838, ఉత్తరప్రదేశ్ లో 711, గుజరాత్ లో 698, మధ్యప్రదేశ్ లో 621, కర్ణాటకలో 600, వెస్ట్ బెంగాల్ లో 1153, రాజస్థాన్ లో 502 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ