ప్రముఖ సినీ గేయ, సంభాషణ రచయిత వెన్నెలకంటి (63) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ గేయరచయితగా వెన్నెలకంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. ముఖ్యంగా తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటుగా డబ్బింగ్ చిత్రాలకు ఆయన పాటలు మరియు మాటలు కూడా రాశారు. ఆయన 2 వేలకు పైగా పాటలు రాయగా, పలు చిత్రాల్లో రాసిన పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఆయన కుమారులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళిలు కూడా సినీరంగంలోనే కొనసాగుతున్నారు. వెన్నెలకంటి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ