దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వరుసగా 20 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 38,079 కరోనా కేసులు నమోదవడంతో జూలై 17, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,64,908 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 560 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,13,091 కి పెరిగింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.31 శాతం:
ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, అస్సాం, మణిపూర్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 4,24,025 (1.36%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 43,916 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,02,27,792 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.31 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ఇక జూలై 16, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 44,20,21,954 కు చేరుకుంది. గత 24 గంటల్లో 19,98,715 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ