మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 17, శనివారం నాడు 8172 కరోనా కేసులు, 124 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,05,190 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,26,851 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 8,950 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 59,74,594 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.28 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.04 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,00,429 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 16339 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 15793, ముంబయిలో 10672, కొల్హాపూర్ లో 10048, సంగ్లీలో 9872 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 4,52,60,468 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ