సెప్టెంబర్ 12 నుంచి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

BJP Telangana Chief Bandi Sanjay 4th Phase Praja Sangrama Yatra Starts from September 12, Bandi Sanjay Praja Sangrama Yatra, BJP Telangana Chief Bandi Sanjay, BJP Bandi Sanjay 4th Phase Praja Sangrama Yatra, Praja Sangrama Yatra Starts from Sep12, Praja Sangrama Yatra , Mango News ,Mango News Telugu, BJP Telangana Chief Bandi Sanjay, Bandi Sanjay Latest News And Updates, BJP Telangana, Praja Sangrama Yatra Live Updates

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో నాలుగో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయింది. సెప్టెంబర్ 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగో విడత పాదయాత్రను ప్రారంభించి, సెప్టెంబర్ 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నట్టు తెలిపారు. బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర మొత్తం 10 రోజుల పాటుగా నగర పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115.3 కిమీ మేర కొనసాగనున్నట్టు తెలిపారు.

కాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమంలో బండి సంజయ్ కూడా పాల్గొనుండంతో ఆ రోజున పాదయాత్ర ఉండదని పేర్కొన్నారు. మరోవైపు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి, పాదయాత్ర కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లలో నిమగ్నమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =