దేశంలో కరోనా: కొత్తగా 5,747 మందికి పాజిటివ్, 216.41 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

India Records 5747 New Covid-19 Positive Cases 29 Deaths in Last 24 Hours, , India Records 5747 New Covid Cases, 29 Covid Deaths September 17th, Mango News, Mango News Telugu, India Logs 5747 Covid Positive Cases, 5747 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 5,747 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,28,524 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (2211), మహారాష్ట్ర (697), తమిళనాడు (463), కర్ణాటక (426), వెస్ట్ బెంగాల్ (275), ఒడిశా (214), రాజస్థాన్ (195), గుజరాత్ (147), ఢిల్లీ (123) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 29 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,302 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 46 వేలుకుపైగా (46,848 (0.11%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..

కొత్తగా 5,618 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,39,53,374 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.71 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్ 17, శనివారం ఉదయం 7 గంటల వరకు 216.41 కోట్లకుపైగా (2,16,41,70,550) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 23,92,530 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 2 =