దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 73 రోజుల తరవాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 8 లక్షల కంటే (7,98,656) తక్కువుకు చేరుకుంది. అలాగే వరుసగా 36వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 62480 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,62,793 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 1587 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,83,490 కి పెరిగింది.
కొత్తగా కేరళ (12,469), మహారాష్ట్ర (9,830), తమిళనాడు (9,118), ఆంధ్రప్రదేశ్ (6,151), కర్ణాటక (5,983), ఒడిశా (3,631), అస్సాం (3,477), వెస్ట్ బెంగాల్ (3,018), తెలంగాణ (1,492), పంజాబ్ (728) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 88,977 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,85,80,647 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.03 శాతం గానూ, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ