దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,43,21,025 కు చేరుకుంది. అలాగే కరోనాతో 461 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,59,652 కు పెరిగింది. దేశంలో ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఏపీ, మిజోరాం, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. ఇక ప్రస్తుతం 1,48,579 (0.43%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 15,054 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,37,12,794 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 4, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 61,23,46,767
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,43,21,025
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 3–నవంబర్ 4 (8AM-8AM)] : 12885
- నమోదైన మరణాలు : 461
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,37,12,794
- యాక్టీవ్ కేసులు : 1,48,579
- మొత్తం మరణాల సంఖ్య : 4,59,652
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ