దేశంలో గత 24 గంటల్లో మొత్తం 82,027 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 266 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.32 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,88,367 కు చేరుకుంది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,775 గా ఉంది. కాగా మరో 197 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,54,622 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది
కాగా ప్రస్తుతం దేశంలో 2,970 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొద్దిగా ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 70 పైన కరోనా కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (మార్చి 6 (8am)–మార్చి 7 (8am)):
- కర్ణాటక – 64
- కేరళ – 55
- మహారాష్ట్ర – 35
- తమిళనాడు – 27
- తెలంగాణ – 20.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE