తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 506 కింద నల్లగొండ వన్ టౌన్ పోలీసులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల వెలుగు చూసిన ఒక ఆడియోలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ను తన అనుచరులు చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ కొడుకు డాక్టర్ సుహాస్కు ఎంపీ కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డిపై చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రితో పాటు తనను చంపుతానంటూ ఎంపీ కోమటిరెడ్డి ఫోన్లో బెదిరించారని, ఆయన వలన తామిద్దరికి ప్రాణహానీ ఉందని చెరుకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఎంపీ వెంకట్ రెడ్డి దీనిపై ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంలో చేసినవేనని, అంత సీరియస్గా తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు. అంతేకాకుండా తనపై విమర్శలు చేయొద్దని చెరుకు సుధాకర్కు చెప్పాల్సిందిగా ఆయన కుమారుడు సుహాస్కు సూచించానని కోమటిరెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి బెదిరింపులకు పాల్పడిన ఆడియోను చెరుకు సుధాకర్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులకు పంపించారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కూడా పంపనున్నట్లు తెలియజేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE