దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 132 రోజుల తర్వాత మొదటిసారిగా రోజువారీ పాజిటివ్ కేసులు 30 వేల కంటే తక్కువుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదవడంతో జూలై 27, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,40,951 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 415 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,21,382 కి పెరిగింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో దాదాపు 4 లక్షల యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.39 శాతం:
ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, మిజోరాం, మణిపూర్, వెస్ట్ బెంగాల్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 3,98,100 (1.27%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 42,363 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,06,21,469 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.39 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ఇక జూలై 26, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 45,91,64,121 కు చేరుకుంది. జూలై 26న 17,20,110 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ