భారత్లో కరోనా మళ్ళీ వ్యాపిస్తోంది. గత నాలుగో రోజులుగా వరుసగా మూడు వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు బుధవారం మరింత పైకి ఎగబాకాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో నాలుగు వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో (మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) 1,31,086 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 4,435 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,33,719కి చేరినట్లయింది.
కాగా గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు వెలుగు చూసిన 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత 24 గంటల వ్యవధిలో కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున.. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక, పుదుచ్ఛేరిలో ఒక్కొక్కరు చొప్పున, మొత్తం 15 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 5,30,916కి పెరిగింది. ఇక రోజు రోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు చేసింది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 05, ఉదయం 8 గంటల వరకు):
- ఏప్రిల్ 4న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,31,086
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 04–ఏప్రిల్ 05 (8AM-8AM)] : 4,435
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,33,719
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 2,069
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,79,712
- కరోనా రికవరీ రేటు : 98.76 శాతం
- యాక్టీవ్ కేసులు : 23,091
- కొత్తగా నమోదైన మరణాలు : 15
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,916
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.66 కోట్లు పంపిణీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE