భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ జట్టు 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ తోలి ఇన్నింగ్స్ లో శార్దూల్ ఠాకూర్ (57), విరాట్ కోహ్లీ (50) పరుగులతో కీలక ప్రదర్శన చేయగా, రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సెంచరీ (127), శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50) పరుగులతో రాణించారు. అలాగే భారత్ బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో నాలుగో టెస్టులో భారత్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది.
ముందుగా రెండో ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లాండ్ ముందు భారత్ 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఉమేశ్ యాదవ్ 3, శార్దూల్ ఠాకూర్ 2, బుమ్రా 2, రవీంద్ర జడేజా 2, వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్లు రోరీ బర్న్స్ (50), హసీబ్ హమీద్ (63) కెప్టెన్ జో రూట్ (36) మాత్రమే పరుగులు సాధించగలిగారు. ఇక ఇరు జట్ల మధ్య ఐదో టెస్ట్ సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరగనుంది.
భారత్–ఇంగ్లాండ్ నాలుగో టెస్టు వివరాలు:
భారత్ తోలి ఇన్నింగ్స్: 191-10
- శార్దూల్ ఠాకూర్ (57), విరాట్ కోహ్లీ (50)
- క్రిస్ వోక్స్ 4/55, రాబిన్సన్ 3/38
ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్: 290 -10
- ఓలి పోప్ (81), క్రిస్ వోక్స్ (50)
- ఉమేశ్ యాదవ్ 3/76, బుమ్రా 2/67, రవీంద్ర జడేజా 2/36
భారత్ రెండో ఇన్నింగ్స్: 466-10
- రోహిత్ శర్మ సెంచరీ (127), శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50)
- క్రిస్ వోక్స్ 3/83, రాబిన్సన్ 2/105, మొయిన్ అలీ 2/118
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్: 210-10
- హసీబ్ హమీద్ (63), రోరీ బర్న్స్ (50)
- ఉమేశ్ యాదవ్ 3/60, శార్దూల్ ఠాకూర్ 2/22, బుమ్రా 2/27, రవీంద్ర జడేజా 2/50
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ