దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్ 94/4 తో చివరి రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 97 పరుగులు జోడించి 191 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 113 పరుగులతో మొదటి టెస్టుని గెలుచుకుంది. ఎల్గర్ (77), బవుమా (35), క్వింటన్ డికాక్ (21) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేదు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా తలో 3 వికెట్లు సాధించారు. సిరాజ్, అశ్విన్ 2 చొప్పున వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ 3 టెస్టుల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 327, రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ లోకేష్ రాహుల్ శతకం సాధించటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ