భారత్ లో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే 14, గురువారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78003 కి చేరగా, 2549 మంది మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 25,992 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5547 మంది కోలుకోగా, 975 మంది మృతిచెందారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,001 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్టు తెలుస్తుంది. వీరిలో 851 మంది చికిత్స తీసుకుంటుండగా, 142 మంది పోలీసులు కోలుకున్నట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో ఎనిమిది మంది పోలీసులు కరోనావైరస్ వలన మరణించినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu