భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్జున్వాలా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. స్టాక్ మార్కెట్ ట్రేడర్గా, చార్టెడ్ అకౌంటెంట్గా ప్రఖ్యాతి గాంచిన ఆయన భారతీయ సంపన్నులలో ఒకరుగా ఉన్నారు. ఆయనను ‘వారెన్ బఫెట్ ఆఫ్ ది ఇండియన్ మార్కెట్’ అని పిలుస్తుంటారు. 1960 జూలై 5వ తేదీన ముంబయిలో జన్మించిన ఆయన గ్రాడ్యూయేషన్ పూర్తిచేసి, 1985లో రూ.5 వేలతో మొట్టమొదటిసారిగా స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. ప్రముఖ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన రేఖా ఝున్ఝున్వాలా ఆయన భార్య. కాగా జున్జున్వాలా నికర ఆస్తుల విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్లు) ఉండొచ్చని సమాచారం.
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
ఈ సందర్భంగా రాకేష్ జున్జున్వాలాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. ‘రాకేష్ ఝున్జున్వాలా ఎక్కడా ఎలాంటి కష్టనష్టాలకు లొంగలేదు. ఆయన పూర్తి జీవితం ఎంతో ఆసక్తిదాయకం. ఆయన ఒక తెలివైన, ముందుచూపు కలిగిన వ్యాపారవేత్త. దేశ ఆర్ధిక పురోగతిలో తన పాత్ర సమర్ధవంతం. జున్జున్వాలా మృతి బాధాకరం.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఇక మరోవైపు ఝున్ఝున్వాలా మృతితో పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY