ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్ ‘వాట్సాప్’కు భారత్ కీలక సూచన చేసింది. ఈనెల 25వ తేదీన భారత్ లో సర్వీస్ ఆగిపోవడానికి గల కారణాలను తెలపాలని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ను కోరింది. ఈ మేరకు బుధవారం భారత సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వివరణాత్మక నివేదికను కోరింది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మాకు దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల నుంచి వాట్సాప్పై ఫిర్యాదులు అందాయని, దీనికి సంబంధించి కంపెనీ నుండి వివరణాత్మక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరామని తెలిపారు. అలాగే వాట్సాప్ యొక్క మాతృ సంస్థ అయిన ‘మెటా’ తన నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించడానికి ఒక వారం సమయం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
కాగా మంగళవారం నాడు దాదాపు రెండు గంటల పాటు వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు తమ ఫోన్ల నుంచి టెక్స్ట్ మరియు వీడియో సందేశాలను పంపడం లేదా స్వీకరించడం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. వీరితోపాటు వాట్సాప్ వెబ్ వినియోగదారులు కూడా అంతరాయంతో పలు ఇబ్బందులకు గురైనట్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో తెలియజేశారు. ఇండియాలో డౌన్డెటెక్టర్ డౌన్డెటెక్టర్ ట్రాకర్ హీట్ మ్యాప్ ఆధారంగా అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్తో పాటు నాగ్పూర్ మరియు లక్నో వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. కాగా డౌన్డెటెక్టర్ ట్రాకర్ ప్రకారం ఇండియాలోనే కాకుండా పలు ఇతర దేశాలు కూడా వాట్సాప్లో ఆంతర్యాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY