భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత రెండ్రోజులుగా ఒకేరోజు వ్యవధిలో 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్ ను దాటిసి భారత్ 2 వ స్థానానికి చేరుకుంది. అలాగే అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ 3 స్థానంలో కొనసాగుతుంది. సెప్టెంబర్ 7, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,613 కు, మరణాల సంఖ్య 71,642 కు చేరుకుంది.
గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 90,802 కరోనా పాజిటివ్ కేసులు, 1016 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32 లక్షలు దాటింది. ఒకే రోజులో 69,564 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 32,50,429 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 77.3 శాతంగా నమోదైంది. అలాగే దేశంలో కరోనా మరణాల రేటు 1.7 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 8,82,542 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu