ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2021 కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నైట్రైడర్స్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సోమవారం రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను రీషెడ్యూలు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గత నాలుగు రోజుల్లో మూడో రౌండ్ పరీక్షలో కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ప్రకటించారు. కాగా మిగతా కేకేఆర్ జట్టు సభ్యులందకి కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా పాజిటివ్ గా తేలిన ఇద్దరు ఆటగాళ్ళు మిగతా జట్టు నుండి వేరుగా ఐసోలేషన్ లో ఉన్నారని, వైద్య బృందం వీరిద్దరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఈ సీజన్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతకు బీసీసీఐ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ప్రాధాన్యత ఇస్తాయని, అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ