పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మే 5, బుధవారం రాత్రి 7 గంటలకు మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు టీఎంసీ సీనియర్ నేత పార్థ ఛటర్జీ ప్రకటించారు. సోమవారం నాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేలంతా సమావేశమై తమ శాసనసభాపక్ష నేతగా మమతా బెనర్జీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మమతా బెనర్జీ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ను కలవనున్నట్లు తెలుస్తుంది. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ