భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు చిన్న ఉపగ్రహాలతో రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా రేపు సతీష్ ధవన్ స్పేస్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ను ప్రయోగించేందుకు సైంటిస్టులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఇది ఈ సిరీస్లో రెండో ప్రయోగం. ఇంతకుముందు గతేడాది ఆగస్టు 7న తొలిసారిగా పంపిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమయింది. శాటిలైట్ ఈఓఎస్-2ను అజాదిశాట్ కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో రేపటి ప్రయోగంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఈ సారి ప్రయోగం కేవలం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది.
ఈ క్రమంలో ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఈ రాకెట్ను ఫైనల్గా టెస్ట్ చేసి ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్డౌన్ను ప్రకటిస్తారు. దీనిప్రకారం.. ఈ అర్ధరాత్రి 2.18 గంటలకు కౌంట్డౌన్ మొదలు కానుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 12 నిమిషాల్లోనే తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అనంతరం మిగిలిన రెండు ఉపగ్రహాలను నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి పంపించనున్నారు. కాగా ఈ ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను తక్కువ ఖర్చుతో చిన్న పాటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకై ఇస్రో ప్రత్యేకంగా నిర్మించింది. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చిన ఆయనకు ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఛైర్మన్ సోమనాథ్ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE